
‘అమృతలత జీవన సాఫల్య’ పురస్కారాలను ‘అనువాదం/వ్యాసరచన’ విభాగంలో డా.అరుణావ్యాస్, ‘నవలా రచన’లో గంటి సుజల, ‘శాస్త్రీయ నృత్యం’లో కోసూరి ఉమాభారతి గార్లకు ప్రదానం చేయనున్నారు.‘అపురూప’ పురస్కారాలను `డా.చాగంటి కృష్ణకుమారి (వైజ్ఞానిక రచన), మాడభూషి లలితాదేవి (సాహితీ సంస్థ నిర్వహణ), డా.శ్యామల గడ్డం (గజల్ ప్రక్రియ), శ్రీదేవి మురళీధర్ (జీవిత చరిత్ర), అల్లూరి గౌరీ లక్ష్మి (కథా రచన), భండారు విజయ (సంపాదకత్వం), హిమజ (కవిత్వం), సమ్మెట విజయ (నాటక రంగ పరిశోధనా రచన), డా.సామవేదం వెంకట కామేశ్వరి (వైద్యరంగం, సామాజిక సేవ), రుబీనా పర్వీన్ (సోషల్ అంట్రప్రెన్యూర్), సలీమా (జర్నలిజం), వీణాధరి (శాస్త్రీయ సంగీతం) విభాగాలలో అందుకుంటున్నారని తెల్పడానికి సంతోషిస్తున్నాము.
ఎన్.టి.ఆర్. ఆడిటోరియం, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, హైదరాబాదులో తేదీ 11-05-2025 (ఆదివారం) సాయంత్రం 4.30 గం.లకు జరుగనున్న ‘అమృతలత- అపురూప అవార్డ్స్-2025’ ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీనటులు శ్రీ తనికెళ్ళ భరణిగారు తదితర ప్రముఖులు విచ్చేయనున్నారు.
అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులతోబాటు సాహితీ కళాభిమానులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
డా.అమృతలతఅవార్డ్స్ వ్యవస్థాపకులు98488 68068
నెల్లుట్ల రమాదేవికన్వీనర్94406 22781— with Amrutha Latha and Amrutha Latha.