
పేరులో లక్ష్మీ పార్వతులని పెట్టుకుని మనసునిండా చదువులతల్లిని ప్రతిష్టించుకున్న పేరెన్నికగన్న రచయిత్రి గౌరీలక్ష్మి.మూడు దశాబ్దాలుగా సాహితీ రంగంలో నవలా,కథా,కవితలే కాక మంచి కాలమిస్ట్ గా కూడా కృషి చేస్తున్నారు.చెప్పదలుచుకున్నది సూటిగా,స్పష్టంగా చెప్తారు.ఉన్నత విద్య నభ్యసించి, హోదాగల ఉద్యోగం చేసినా నిరంతర నిశిత సమాజ పరిశీలనాదృష్టి ఆమెది.రాజకీయ,వ్యంగ్య చిత్రణలో సిద్ధహస్తురాలు.ఈమె నాకు మంచి మిత్రురాలు అవడం నా అదృష్టం అనుకుంటాను.