గుత్తికొండ సుబ్బారావు.మచిలీపట్నం
స్నేహమయి అల్లూరి గౌరీలక్ష్మి ఒక పెద్ద ప్రభుత్వ సంస్థలో పెద్ద ఆఫీసర్ గా పదవీవిరమణ చేశారు… ఉద్యోగంలో వున్నప్పుడూ, రిటైర్ అయినాకా కలుస్తూనేవున్నాం. హితుల యెడ ఆమె కనబరిచే ఆప్యాయత, శ్రద్ధ ల్లో ఏమాత్రం మార్పు లేదు. ఆమె రచనల విషయానికొస్తే ఎక్కువగా సామాజిక స్పృహ, ఒకింత వ్యంగ్యం కన్పిస్తాయి. అనవసరమైన కల్పితాలకు, వర్ణనలకు పోరు. సూటిగా, ధాటిగా సాగుతాయి కథనమైనా, కవితయినా. -గుత్తికొండ సుబ్బారావు.
అడుసుమిల్లి మల్లికార్జున..బాపట్ల
నాకు శైలి,శిల్పం తెలీదు.. కవిత్వం అంతకంటే తెలీదు,అంటారు గౌరీ లక్ష్మి గారు.అందువల్లనేమో ఉత్తమ సాహిత్యం రాయగలిగారు.నవల,కథ,కవిత,గల్పిక…అన్ని ప్రక్రియలు ఆమె కలంతో అందాన్ని సంతరించుకున్నాయి.నలుగురు మిత్రులు,నాలుగు పుస్తకాలు ఉంటే చాలు జీవితానికి అనే ఈమెను ఎవరితోనూ పోల్చటానికి వీలు లేదు.ఒకవేళ పోలిక తెస్తే “బీనా దేవి”గారే అగుపిస్తారు,కాసింత తక్కువా కావచ్చు,కూసింత ఎక్కువా కావచ్చు.సమాజానికి,సాహిత్యానికి అవసరమైన కలం.. గౌరీ లక్ష్మీ గారు.